Health Tips | ఈరోజుల్లో ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ల సంఖ్య ఎక్కువే. ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొందరైతే వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ నాన్వెజ్ రుచి చూస్తుంటారు. అయితే మాంసాహారం ఎక్కువైతే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మాంసాహారం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వాటిలో ఉండే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
అయితే, నాన్వెజ్ ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. పొట్టలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ మనిషిని గుండె జబ్బుకు చేరువ చేస్తుంది. అంతేకాదు బరువు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. కార్బొహైడ్రేట్లు అధికంగా తీసుకోవడంతో జీవక్రియలు నెమ్మదించి మలబద్ధకానికి దారితీయొచ్చు. కాబట్టి, మాంసాహారాన్ని మానాల్సిన పనిలేకున్నా.. పరిమితంగా తీసుకోవడమే మంచిది!