హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (సీసీఐ)లో ఉన్న 503 మంది అనాథ పిల్లలతో విహారయాత్ర నిర్వహించింది. అనాథ పిల్లలకు ఏ లోటు రాకుండా చర్యలు తీసుకోవాలనే సీఎం కేసీఆర్ సూచనలతో సీసీఐల్లో మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్న ఆ శాఖ.. పిల్లలను మూడ్రోజుల విహారయాత్ర కోసం హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఈ నెల 12న నెహ్రూ జూలాజికల్ పార్క్ను సందర్శించిన పిల్లలు.. శనివారం రామోజీ ఫిల్మింసిటీని చూశారు. చివరిరోజైన ఆదివారం రవీంద్రభారతిలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పిల్లలు పాల్గొనడంతో పర్యటన ముగుస్తుందని అధికారులు వెల్లడించారు.