10, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ అనుమతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: పది, పన్నెండో తరగతుల టర్మ్ 1 బోర్డు పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు విద్యార్థులు ఎవరైనా ప్రస్తుతం అడ్మిషన్లు పొందిన నగరంలో లేనట్టయితే ఆన్లైన్ ద్వారా విజ్ఞప్తి చేసుకొని పరీక్షా కేంద్రాన్ని వేరే నగరంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం కొంతమంది సీబీఎస్ఈ విద్యార్థులు తాము అడ్మిషన్లు పొందిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు బోర్డు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.