వీణవంక : సామాజికంగా,ఆర్థికంగా వెనుబడిన దళితజాతి పురోగభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకోచ్చిన దళిత బంధువు పథకం దేశానకే అదర్శం అని మానకొండూర్ నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు అరెపల్లి మోహన్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తరతరాల నుంచి దళతులు ఇతరుల మీద ఆధాపడి జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తాత్కలిక పథకలు ఇచ్చాయే తప్ప ,శాశ్వత పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దళితల బాగుకోసం పదిలక్షల రూపాయల నగదుతో దళితుల జీవితాలలో వెలుగునింపడానికి దళిత బంధు ప్రవేశపెట్టాడన్నారు. దేశంలోనే ఏ రారాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. దళితలు అందుకే కేసీఆర్కు అండగా ఉంటారన్నారు. బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలకు దళితల పై ఒక ఎజెండాలేదన్నారు. దళితుల కోసం ఏమి చేశారో చేప్పుకోలేని పరిస్థితి రెండు పార్టీలదన్నారు.
బీజేపీ దళిత రిజర్వేషన్లు తొలగించడానికి కుట్రలు చేస్తుందని, అందులో భాగంగా లాభాల బాటలో నడుస్తున్న బీఎస్ఎన్ఎల్, రైల్వే, విమానాయ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. రాజ్యాంగం మార్చాలని ప్రయత్నలు చేస్తుందని విమర్శించారు. దళితలంటే గిట్టని బీజేపీకి ఓటుతో బుద్ది చేప్పాలని కోరారు. దళితలందరూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో దళిత నాయకులు గిరి, నర్సయ్య, సతీష్ తాండ్ర శంకర్, రెడ్డి ఐక్య వేదిక జిల్లా నాయకుడు రాంరెడ్డి తదితరలు పాల్గొన్నారు.