ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 9 : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో గురువారం ఆమె పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. ప్రభుత్వ కార్యమ్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి, ఎంపీఓ చంద్రశేఖర్, సర్పంచ్ సిరికొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆత్కూరి అయిలయ్య పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
ఆలేరు రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. మండలంలోని కొలనుపాకలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగ స్వామి, మార్కెట్, పీఏసీఎస్ డైరెక్టర్లు మామిడాల నర్సింహులు, ఆరె మల్లేశ్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ బైరి రమేశ్గౌడ్, మాజీ సర్పంచ్ బక్క మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.