జడ్చర్లటౌన్, నవంబర్ 26 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రా జ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జడ్చర్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్స వ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వివిధ పార్టీ లు, సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, స ర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జడ్చర్లలోని ల యన్స్ క్లబ్ భవనంలో కళాశాల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కడమంచి చెన్నయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో సృ జనాత్మకత, నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నర్సింహ, బాలమణి పాల్గొన్నారు.
పాలమూరు యూనివర్సిటీలో..
మహబూబ్నగర్టౌన్, నవంబర్ 26 : భారత రాజ్యాం గ దినోత్సవాన్ని పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజా త, అధ్యాపకుడు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాఘవేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, స్వరూప,ఎన్వైకే అధికారి కోటానాయక్, వెంకటేశ్వర్లు, జ్యోతి, అస్రీన్, గోపాల్, శ్రీనివాస్, నాగరాజు, తౌఫిక్, వీణ పాల్గొన్నారు. అలాగే ఆదిత్య కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ప్రభాకర్జీ, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు రవికుమార్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, నవంబర్ 26 : భారత రాజ్యాం గ దినోత్సవాన్ని మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కప్పెటలో వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కురుమయ్య, గడ్డం యాదయ్య, అంజి, సాదిక్, ఉపాధ్యాయుడు అశోక్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, నవంబర్ 26 : మండలకేంద్రంతోపాటు, తిర్మలాపూర్, చొక్కంపేట, ఖానాపూర్, ఈద్గాన్పల్లి, కుచ్చర్కల్ గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, నాయకులు యాదగిరి, నరహరి, కే యాదగిరి, దేవేందర్, రామకృష్ణాగౌడ్, చంద్రయ్య, యాదయ్య, కృష్ణ, సాయి, బాలరాజు, రమేశ్రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, నవంబర్ 26 : మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖాజా నవాజ్, ఎంపీటీసీ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి రమేశ్, వార్డుసభ్యులు రమేశ్, నాగరాజు, నాయకులు జగన్గౌడ్, గౌస్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, నవంబర్ 26 : మండలంలోని కంచనపల్లి గ్రా మంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పం చ్ శేఖర్, ఉపాధ్యాయుడు విజయభాస్కర్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, నవంబర్ 26 : మండలకేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 26 : మండలంలోని కందూరులో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, ఉపసర్పంచ్ శంకర్, నాయకులు శ్రీనివాసులు, నాగరాజు, మహేశ్, రాములు, వెంకటయ్య, నాగన్న, మల్లేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, నవంబర్ 26 : మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో రాజ్యాంగ దినోత్సవాన్ని స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మరికల్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. కార్యక్రమంలో రాంచందర్, కృ ష్ణ, సుధాకర్, శ్రీకాంత్, ఆంజనేయులు, మన్యం, రామస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.