బీజింగ్ : ఒకపైపు సూయజ్ కాలువలో అతిపెద్ద నౌక ‘ఎవర్ గివెన్’ నిలిచిపోయి ఇబ్బందులు పెడుతుంటే.. అచ్చంగా అలాంటి సంఘటన ఒకటి వైరల్గా మారింది. ఈ వైరల్గా మారిన ఫొటోలో ఇబ్బంది పెడుతున్న ట్రాలీ కూడా ‘ఎవర్ గివెన్’ కు చెందినదే కావడం విశేషం.
సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించడంతోపాటు వందలాది నౌకలను ఇబ్బందులపాలు చేస్తుండగా.. అదే కంపెనీ లోగో ఉన్న పెద్ద ట్రాలీ ఒకటి చైనాలో ప్రమాదానికి గురై సూయజ్ కాలువ మాదిరి సంఘటనకు డమ్మీగా నిలిచింది. దీని కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
చైనాలోని చాంగ్చున్-షెన్జెన్ ఎక్స్ప్రెస్వే ఆదివారం ఉదయం సమయంలో ‘ఎవర్ గివెన్’ లోగో ఉన్న పెద్ద ట్రాలీ ఒకటి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దాంతో దాని వెనకున్న వాహనాలు దాదాపు ఐదారు గంటలపాటు నిలిచిపోయాయి.
ఎవర్ గివెన్ మెయిన్ల్యాండ్ చైనాలో ట్రైలర్ వ్యాపారాన్ని నిర్వహించదని, సముద్ర రవాణాపై మాత్రమే దృష్టి సారించిందని చైనా టైమ్స్ నివేదించింది. సూయజ్ కెనాల్లో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురిచేసిన సమయంలోనే అదే సంస్థ లోగోతో ఉన్న ట్రాలీ ఇలా రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడం కాకతాళీయంగా జరిగిపోయింది.
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..