న్యూఢిల్లీ : యూఏఈ నుంచి భారత్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. తదుపరి నోటీసు జారీ చేసే వరకు సర్వీసులు నడవవని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి మధ్య యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి విమానాలను నిషేధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, యూఏఈ జాతీయులు, దౌత్య కార్యకలాపాలు, అధికారిక ప్రతినిధులు, గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. ప్రయాణికులు నిబంధనలకు లోబడి ఉంటారని ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్కు ఎతిహాద్ విమానాలు నడుస్తాయని, కార్గో విమానాలు రెండు వైపులా కొనసాగుతాయని సంస్థ పేర్కొంది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.