సికింద్రాబాద్, జనవరి 24: సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందన్నారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో మూడో వార్డు సిఖ్ విలేజ్కు చెందిన నీల మోహన్రావు వైద్యం కోసం రూ.1.50లక్షల విలువ చేసే ఎల్వోసీని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో మోహన్రావు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.1.50లక్షల విలువ గల ఎల్వోసీని లబ్ధిదారుడికి అందజేశారు.
రసూల్పురాలో బోర్వెల్ పనుల ప్రారంభం
కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి నిధులను కేటాయిస్తూ బోర్వెల్లు వేయించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు సోమవారం బోర్డు పరిధిలోని రెండో వార్డు రసూల్పురా సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద నూతన బోర్వెల్ పనులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఎనిమిది వార్డుల్లో నీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నూతన బోర్వెల్లు వేయిస్తున్నామని, రానున్న వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
ఆదే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో ఒక్కొక్కటిగా పేరుకుపోయిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. సీడీపీ నిధుల నుంచి ప్రభుత్వ బడులను పునరుద్ధరించే క్రమంలో సుమారు రూ.2 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. టాయ్లెట్ల నుంచి ఎలక్ట్రికల్, ఫర్నిచర్ వంటి పనులు చేయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, రెండో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ ధన్రాజ్, నర్సింహ, గౌస్, ఉస్మాన్, ప్రవీణ్, నరేశ్, బాల్రాజ్, రఫిక్, రాకేశ్, పరశురామ్, నజీర్, హైమత్, తౌఫిక్, ఆజామ్, అనిల్, జాకీర్, సదానంద్గౌడ్, తేజ్పాల్, భాస్కర్ముదిరాజ్, రామ్మోహన్, సంతోష్, మురళీయాదవ్ పాల్గొన్నారు.
విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు ప్రారంభం
మారేడ్పల్లి, జనవరి 24: కంటోన్మెంట్ నాలుగవ వార్డు భూలక్ష్మి ఆలయం వద్ద సీడీపీ నిధుల నుంచి హెచ్టీ కరెంటు లైన్ షిప్టింగ్ పనులను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.