అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే నాలుగో టీ20లో భారత్ తప్పక నెగ్గాల్సిందే. గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని మోర్గాన్ వెల్లడించాడు. గాయం కారణంగా దూరమైన ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో యుజువేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చాహర్ను ఎంపికచేసినట్లు కోహ్లీ వివరించాడు.