కాశ్మీర్ : సెంట్రల్ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులోని నౌగామ్లోని వాగురా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాయింట్లను మూసివేసి, భారీగా బలగాలను అక్కడికి తరలించారు. చీకటి ఉండడంతో ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో లైట్లను అమర్చారు. ఎన్కౌంటర్కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.