దిలావర్పూర్. మార్చి 24 : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే భారీ విజయమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికకు హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలే ్ధ అక్షరను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టంచేశారు. సమయం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారన్నారు. ఆహార పంటల సేకరణలో దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, కానీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తెలంగాణ రైతులపై వివక్ష చూపెడుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని తమ సర్కారు అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పార్టీల వారికి అందజేస్తున్నామని చెప్పారు. అలాంటిది కేంద్రంలోని సర్కారు తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణలో మాత్రం వివక్ష చూపడం సరికాదన్నారు. దిలావర్పూర్ మండల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తానని చెప్పారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అమృత అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పాల్ధే అక్షర, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు ఏలాల చిన్నరెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అన్వర్ఖాన్, కదిలి, కాల్వ ఆలయ చైర్మన్లు భుజంగ్రావు, చిన్నయ్య, నర్సపూర్(జీ) జడ్పీటీసీ రామయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్ధే అనిల్, స్వామిగౌడ్, కృష్ణ, గోవిందుల మహేశ్, పీ శ్రీనివాస్, సాగర్, సంబాజీ పటేల్, బక్కన్న, మహేశ్, ధనే రవి, సప్పల రవి, నరేశ్ పాల్గొన్నారు
దిలావర్పూర్ ఎంపీపీ ఎన్నిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాంతి కుమార్ అధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరుగురు ఎంపీటీసీలు ఉండగా.. ఈ కార్యక్రమానికి గుండంపల్లి ఎంపీటీసీ ఏలాల అమృత, సాంగ్వి ఎంపీటీసీ జయసుధ, కాల్వ ఎంపీటీసీ బాబురావు, దిలావర్పూర్ ఎంపీపీ పాల్ధే అక్షరతో పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అన్వర్ హాజరయ్యారు. కోరం ఉండడంతో ఎన్నిక నిర్వహించగా.. ఎంపీపీగా పాల్ధే అక్షర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎంపీపీతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, తహసీల్దార్ హిమబిందు, ఎంపీవో అజీజ్ఖాన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.