రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శుక్రవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అయ్యగల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు.
మసాన్ పల్లి ప్రభాకర్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం, పోరాడుతానని వెల్లడించారు. ఉపాధ్యక్షుడు కుమ్మరి యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా గల్వా సంతోష్ రెడ్డి, సొక్కం నర్సింలు, కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా గట్టు బిక్షపతి, అధికార ప్రతినిధిగా పటాన్ అలీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యవర్గ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య, సలహాదారులు కుమ్మరి స్వామి, ఇప్ప నారాయణ, సభ్యులు తుప్పతి మల్లేశం,పొట్టోళ్ళ మల్లేశం, రామొల్ల బిక్షపతి, స్వామి, అరిగే యాదయ్య, ఇప్ప రాములు తదితరులు పాల్గొన్నారు.