హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ బలోపేతానికి కృషిచేస్తామని డెయిరీ ఓసీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సంఘం తొలి సమావేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం అధ్యక్షుడిగా సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ డెయిరీ బలోపేతంతోపాటు వినియోగదారులకు విజయ ఉత్పత్తులను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి రమేశ్ గౌరి, మసలుద్దీన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.