పెద్దపల్లి : ఉపాధ్యాయుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. జిల్లాలోని జడ్పీఎచ్ఎస్ ఎక్లాస్ పూర్ పాఠశాలలో ఉచిత సోలార్ స్టడీ లాంప్స్, ఫ్యాన్లు, పుస్తకాల పంపిణీ కార్యమానికి అతిథిగా హాజరయ్యారు.
పాఠశాలకు ఎమ్మెల్సీ నిధుల నుంచి లైబ్రరీ, నాలుగు లక్షల రూపాయలతో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మంథని ఎమ్మార్సీకి ప్రహరీ గోడను మంజూరు చేశారు. అదే విధంగా పెద్దపల్లి జిల్లాలోని ఏ ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతుల సమస్యలైన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే తసమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎం పి పి కొండా శంకర్ జడ్పీటీసీ తగరం సుమలత, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని మండల విద్యాధికారి లక్ష్మి, పీఆర్టీయూఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రు సురేష్, గండు కృష్ణమూర్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ చలువాజి నాగేశ్వర్ రావు, గ్రామ సర్పంచ్ చెన్నవేన సదానందం, ఎంపీటీసీ చైతన్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.