జవహర్నగర్, మార్చి 25: కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థలోని 24వ డివిజన్ కార్పొరేటర్ గొడుగు వేణు ఆధ్వర్యంలో రూ. 5లక్షలతో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఈ చెన్నకేశవులు, కార్పొరేటర్ నవీన్కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీరామ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్, రాధిక, శోభారాణి, సుజాత, నాగరాజు, వినోద్, సతీశ్ గౌడ్, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.