హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో శనివారం ప్రారంభమైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలు ప్రారంభించి దేశానికే ఆదర్శంగా నిలిచార ని పేర్కొన్నారు. సమావేశాలకు ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ నాయకులు ఎస్ఎన్ సిన్హా, భలవిందర్ సింగ్ జమ్మూ, వై నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ తదితరులతోపాటు 20 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.