హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్స్, చైనా తదితర దేశాల్లో కరోనా వైరస్ మరో రూపంలో తిరిగి ప్రబలిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను మరింత ఉద్ధృతంగా చేపట్టేందుకు గ్రామ/ మున్సిపల్ వార్డుస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. బృందంలో ఆశావరర్, అంగన్వాడీ వరర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలను సభ్యులుగా చేయాలని పేరొన్నారు. గ్రామానికో నోడల్ అధికారిని, మండలానికో ప్రత్యేకాధికారిని నియమించి ప్రతిరోజూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశిచారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్పై మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడుకోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేశామని తెలిపారు. వ్యాక్సిన్ డోసులు, సిరంజీలు సరిపడా ఉన్నాయని ఆయన చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సందీప్కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, శేషాద్రి, రఘునందన్రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సత్యనారాయణ, సర్ఫరాజ్ అహ్మద్, ఏ శరత్, దివ్యాదేవరాజన్, గడల శ్రీనివాస్రావు, రమేశ్రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.