భారత, బ్రిటన్ దేశాల ప్రధానులు, అమెరికా, చైనా,రష్యా దేశాల అధ్యక్షులు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాధాన్యం గల దేశాల పాలకులు. వారి ప్రాణ రక్షణ కోసం ఆయా దేశాలు పటిష్ఠమైన భద్రతను ఇస్తాయి. రక్షణ ఏర్పాట్లు, ఆధునిక ఆయుధాలు, సమర్థులైన భద్రతాధికారులు వారికోసం సిద్ధంగా ఉంటారు.
పంజాబ్లోని ఓ సభలో పాల్గొని, ప్రసంగించేందుకు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న పంజాబ్ రైతులు మోదీని ఘెరావ్ చేశారు. దీంతో ఆయన కాన్వా య్ ఫిరోజ్పూర్లోని ఓ బ్రిడ్జిపై 20 నిమిషాల పాటు ఆగిపోయింది. రైతు ఉద్యమ సమయంలో తమను ఇబ్బందులకు గురిచేసినందుకు గాను పంజాబ్ రైతులు ఇలా నిరసన తెలిపారు.
ప్రధాని మోదీ పంజాబ్లోని భటిండా చేరుకొని ‘ప్రాణాలతో క్షేమంగా భటిండా చేరినందుకు పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’నంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ పంజాబ్ ముఖ్యమంత్రిని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారో ఆ ట్వీట్తోనే అర్థమైంది. అక్కడ జరిగిందొక్కటి, మోదీజీ చెప్పిందొక్కటి. ఆ రోజు జరిగిన సంఘటన మోదీ భద్రతా వైఫల్యం కాదు, మోదీ పాల్గొని ప్రసంగించనున్న సభలో ప్రేక్షకుల్లేరు. లక్షలాది మంది ప్రజలు వస్తారనుకుంటే వెయ్యి మంది కూడా రాలేదు. వర్షం కురవడంతో ఆ కొద్ది మంది కూడా వెళ్లిపోయారు. దేశ ప్రధాని మోదీని ఘెరావ్ చేయటమే కాకుండా నాటి బహిరంగసభలో మోదీ ప్రసంగించకుండా చేసింది కడుపు మండి, మోకా కోసం ఎదురుచూసిన పంజాబ్ రైతులే. పరాభవాలను అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అయిన మోదీ ఈ పరాభవాన్ని కూడా పంజాబ్ ప్రభుత్వంపైకి నెట్టి సమస్యను సులభం చేసుకున్నారు.
మోదీని అడ్డుకోవాలి, పంజాబ్లో పర్యటించకుండా, ప్రసంగించకుండా చేయాలని పంజాబ్ రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. అవకాశం రాగానే అమలుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రైతులను అనేక విధాలుగా వేధింపులకు గురిచేసింది నిజం కాదా? కేంద్ర వ్యవసాయ చట్టాలను ఎదిరిస్తూ చేసిన పోరాటంలో ఏడు వందల మంది రైతులు చనిపోయింది నిజం కాదా? ‘అయ్యో రైతులు చనిపోయారు కదా’ అని బీజేపీ నాయకుడు, ఒక రాష్ట్ర గవర్నర్ ప్రశ్నించినప్పుడు మోదీజీ జవాబేం ఇచ్చారో తెలుసా? ‘ఆ రైతులు నా కోసం చనిపోయారా?’ అని.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ర్టాలకు అతి త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లాభం పొందటం కోసమే మోదీ ఈ వ్యూహాన్ని పన్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తాజా ప్రకటన. మోదీ భద్రతలో జరిగిన లోపాలకు కాంగ్రెస్ నేత సోనియాగాంధీయే కారణమట! ఆమె తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి చన్నీ ద్వారా పంజాబ్లో మోదీ ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేయించారని చౌహాన్ ఆరోపణ.
కేంద్ర మాజీ హోంశాఖ సెక్రటరీ పిైళ్లె చెప్పిందేమిటి? దేశ ప్రధాని భద్రత ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) బాధ్యత. ఈ దళాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం కేంద్రం ఏర్పాటుచేసింది. వాళ్ల నిబంధనల ప్రకారం ప్రధాని కాన్వాయ్లో, మోదీ కూర్చుని ఉన్న వాహనం కంటే ఒక కిలోమీటర్ ముందుగా ఎస్పీజీ వాహనం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ఎస్పీజీ సిబ్బంది రైతులను ఎందుకు గుర్తించలేదు. అలా అప్రమత్తంగా లేని ఎస్పీజీ వల్లనే మోదీ బ్రిడ్జిపై చిక్కుకుపోయారనేది నిజం. పంజాబ్ పోలీసులు ఎస్పీజీ అడిగినంత మేరకే సహకరించాలి. కానీ తుది బాధ్యత మాత్రం ఎస్పీజీదే. పైగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లు ఏం చేస్తున్నాయని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ అడిగారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ ‘తమ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సహకారం అందించిందని తమ లోపమేం లేదని, ప్రధాని అకస్మాత్తుగా తను ప్రయాణించే మార్గాన్ని మార్చుకున్నా’రని తెలిపారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ర్టాలకు అతి త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లాభం పొందటం కోసమే మోదీ ఈ వ్యూహాన్ని పన్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తాజా ప్రకటన. మోదీ భద్రతలో జరిగిన లోపాలకు కాంగ్రెస్ నేత సోనియాగాంధీయే కారణమట? ఆమె తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి చన్నీ ద్వారా పంజాబ్లో మోదీ ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేయించారని చౌహాన్ ఆరోపణ.
దేశ ప్రధాని అంటే అందరికీ గౌరవం, ప్రేమ ఉండటం సహజం. ఆయన ప్రాణాలకు ముప్పు రావాలని ఎవరు కోరుకుంటారు? కానీ సమస్యను దారితప్పించటం, టెర్రరిస్టు కోణాన్ని జతచేయటం, అమాయక పంజాబ్ రైతులను టెర్రరిస్టులని రేపటి నుంచి అరెస్టులు చేయటం గనుక చేస్తే నిజాలు తప్పక బయటికి వస్తాయి. మోదీజీకి అసలుకే మోసం వస్తుంది.
ఒక్క మోదీదే కాదు, భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఇటీవల చాలా జరిగాయి. ముందు వాటిపై కేంద్రం విచారణ జరపాలి. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందు పుల్వామాలో సైనిక శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది వీరసైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొన్నటి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం, అరుణాచల్ రాష్ట్రంలో జనవరి 1న చైనా జెండా ఎగరటం వంటి ఎన్నో ఘటనలపై ఆరా తీయాలి. నిజాలను ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే బీజేపీ నేతలకు ముఖ్యమైన ఎన్నికలను ఎదుర్కొనేముందు ఏదో సంఘటనను చిలువలు, పలువలుగా ప్రచారం చేసి, ఆయా ఎన్నికల్లో లబ్ధి పొందటం రివాజుగా మారింది. తాజాగా జరిగిన ఈ లోపానికి పంజాబ్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి ఏం చర్యలు తీసుకుంటారు? పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధిస్తారా? తద్వారా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందుతారా?
కర్ర ఎల్లారెడ్డి
98662 52260