దక్షిణ భారతదేశం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా కేసీఆర్ ముందుకురావడం తెలంగాణకు గర్వకారణం. రాజకీయ జీవితంలో అపజయమన్నది ఎరుగని కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే దేశానికి మంచిరోజులు మొదలవుతాయి. బీజేపీ ముక్త్ భారత్ను కేసీఆర్ సాధించాలని దేశమంతా కోరుకుంటున్నది.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కిషన్రెడ్డి ప్రకటించడాన్ని రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రజలు… ఇలా అందరూ ఖండిస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. బండి సంజయ్ పార్లమెంటులో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు. అరవింద్, బాపూరావులకు ఈ విషయమై ఎం దుకు నోరు పెగలదని ప్రశ్నిస్తున్నారు.
తనకు నచ్చని రాజకీయ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ర్టాల పట్ల వివక్ష చూపించడం మోదీ సర్కారుకు కొత్త కాదు. అందులోనూ దక్షిణాది రాష్ర్టాలు అంటేనే మోదీ ప్రభుత్వానికి మొదటి నుంచీ శీత కన్నే. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం విస్మరించడం ఆ పార్టీ ఘనత. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులదీ అదే దారి. ఈ వివక్షను ఎదుర్కోవడానికే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. దీనికి భయపడిన బీజేపీ నాయకులు ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారు. దేశంలో సాగుతున్న నికృష్ట రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ.
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యం కాదని తేల్చిచెప్పడం ఎనిమిదేండ్ల వయస్సు కలిగిన తెలంగాణ రాష్ర్టాన్ని అణచివేయజూసే ప్రయత్నమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాటి విభజన హామీలకు తల ఊపి, నేడు అధికారంలోకి రాగానే నాలుక మడత వేసింది. తెలంగాణకు రావాల్సిన నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి అనేక హామీల్లో ఏ ఒక్కటీ సాధ్యం కాదని చెప్తున్నది. ఎనిమిదేండ్లలో పారిశ్రామిక వేత్తలకు రూ.20 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఒక గిరిజన వర్సిటీని నెలకొల్పడం కష్టమైందా? అయిదారేండ్లుగా తెలంగాణ మీద శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న మోదీ ప్రభుత్వం చివరికి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చెయ్యడానికి అనేక కొర్రీలను పెడుతున్నది. రాష్ర్టానికి రావాల్సినవాటిలో ఏదో ఒకటి తీసుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీద నిన్నటివరకు తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలను అడియాసలు చేసిన ఆయన ప్రజలకు సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కిషన్రెడ్డి ప్రకటించడాన్ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రజలు… ఇలా అందరూ ఖండిస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. బండి సంజయ్ పార్లమెంటులో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు. అరవింద్, బాపూరావులకు ఈ విషయమై ఎం దుకు నోరు పెగలదని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలదీ ఇదే తీరు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యేదేమిటి? ఈ రెండు జాతీయపార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని.
ఇలాంటి జాతీయ పార్టీలను నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. సమాఖ్య స్ఫూర్తికి పాతర వేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమే సరైనదని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఏనాడైతే కేసీఆర్ దేశమంతా ఉచిత కరెంట్ హామీ ఇచ్చారో నాటినుంచే దేశం దృష్టి కేసీఆర్ వైపు మళ్లింది. మోదీ లాంటి నియంతను సమర్థంగా ఎదుర్కొనే నాయకుడు కేసీఆర్ మాత్రమే అని దేశ ప్రజలు విశ్వసించారు. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టాలని, కేంద్రంలో అధికారాన్ని చేపట్టి తెలంగాణను అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా సుసంపన్నం చెయ్యాలని కోరుకుంటున్నారు.
తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేక రాష్ర్టాల నాయకులను ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చే ప్రసక్తే లేదని కేసీఆర్ ప్రకటించడం యావత్ దేశ రైతాంగాన్ని ఆకర్షించింది. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ర్టాల రైతులు తమ రాష్ట్రంలో కూడా రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ
సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం
కూడా ప్రశంసిస్తున్నది.
కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవార్డుల మీద అవార్డులు ఇస్తున్నది. దేశంలోని ఇరువై అత్యుత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే వాటిలో పందొమ్మిది తెలంగాణవే. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు, స్వచ్ఛమైన పట్టణాలు, నగరాలు, ధాన్యంలో రికార్డు స్థాయి దిగుబడులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా.. ఇలా పలురంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ‘నీతి ఆయోగ్’ సైతం ప్రశంసిస్తూనే ఉన్నది. కేసీఆర్ దూరదృష్టి, కార్యదక్షత, చిత్తశుద్ధి వల్లే తెలంగాణలో ఇంతటి ప్రగతి సాధ్యమైంది. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులకు ఈ ప్రగతి కనిపించకపోవడం శోచనీయం.
విజయదశమి రోజున కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే జాతీయపార్టీని ప్రకటిస్తున్నరని తెలియగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ప్రకంపనలు మొదలయ్యాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధి అంతా తమ ఘనతే అని కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నది. ఇక బీజేపీ నాయకులైతే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతున్నదని, మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నదని నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అయితే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఆ రెండు పార్టీలు తెలుసుకోవాలి. అది కూడా ఎంతోదూరంలో లేదు, దేశ ప్రజలే ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు.
-ఇలపావులూరి మురళీమోహన రావు
81433 18849