న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ ఆఫీసుల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల మనీల్యాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ పత్రికకు సంబంధించిన 12 ప్రదేశాల్లో ఈడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీల్యాండరింగ్ కేసుతో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఇటీవల సోనియా గాంధీని ఈడీ సుమారు వంద ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే.
హెరాల్డ్ హౌజ్లో నాలుగవ అంతస్తులో ఈడీ సోదాలు చేస్తోంది. ఆ ఫ్లోర్లోనే నేషనల్ హెరాల్డ్ పబ్లికేషన్ ఆఫీసు ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈడీ అధికారులు ఆఫీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.