న్యూఢిల్లీ: రేషన్ పంపిణీలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి జ్యో తి ప్రియా మల్లిక్తో సహా మరో ఇద్దరి ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. సుమారు రూ.150 కోట్ల మే ర ఆస్తులను అటాచ్ చేసింది. మాజీ మంత్రి మల్లిక్ తోపాటు అతని సహాయకుడు బాకీబుర్ రెహమాన్, టీఎం సీ నాయకుడు శంకర్ ఆద్యని కూడా దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో మల్లిక్ ఇల్లు, అతని సన్నిహితుల పేరిట ఉన్న అనేక ఇతర బినామీ ఆస్తులు, కోల్కతా, బెంగళూరులోని రెహమాన్కు చెంది న రెండు హోటళ్లు, వివిధ వ్యక్తులకు చెందిన 48 స్థిరాస్తులున్నాయి.