న్యూఢిల్లీ, జనవరి 31: మౌలికరంగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా వెన్నెముక లాంటిదని, అందుకే 2013-14 నుంచి రోడ్ల విస్తరణ క్రమంగా పెరుగుతూ వచ్చిందని సోమవారం పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర ఆర్థికసర్వే తెలిపింది. 2019-20లో 10,237 కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా 2020-2021లో 13,327 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారని పేర్కొన్నది. 2021-22లో గత సెప్టెంబర్ వరకు 3,824 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని వివరించింది. మొత్తం 63.71 లక్షల కిలోమీటర్లతో రోడ్ల వ్యవస్థలో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నదని ఆర్థికసర్వే వెల్లడించింది. మౌలికరంగంలో పెట్టుబడులు పెంచడానికి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఎఫ్పీ), నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ (ఎన్ఐపీ) వంటి చొరవలు చేపట్టినట్టు తెలిపింది.