హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పగటి కలలు కంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిస్తేజంగా ఉన్నదని, ఆ పార్టీని నిద్రలేపాలని రేవంత్ తాపత్రయ పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్లో ఆవరించిన స్తబ్దతతోనే రేవంత్కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్తోపాటు మిగిలిన పార్టీలు సైతం పగటి కలలు కంటున్నాయని, కానీ అవేవీ నిజం కావని పేర్కొన్నారు.