హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నేడు తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, నేడు, రేపు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ నెల 8న అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు. ఈనెల 9 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12న తుది విడత సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 12-15 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సీట్ల రద్దు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 24న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలని, 24 నుంచి 26 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నారు.