తిరుమల, జనవరి 24 : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోతూ కూడా జింక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన భక్తులు జింక పిల్లకు సపర్యలుచేసి కాపాడారు. టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు జింక పిల్లను తిరుపతి జూ పార్కుకు తరలించారు.