హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం నిర్ణయించింది. డబుల్ డిగ్రీ చేస్తున్నవారికి క్రెడిట్స్ను ట్రాన్సఫర్ చేసుకొనే సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి సెమిస్టర్కు 20 క్రెడిట్స్ కేటాయిస్తారు. మార్కెటింగ్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల సిలబస్లో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. సిలబస్లో మార్పులు-చేర్పుల కోసం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి కొనసాగుతున్న బీవోఎస్ కమిటీ సమావేశాలు శనివారం ముగిశాయి. నూతన సిలబస్ మూడు నుంచి ఐదేండ్ల పాటు అమలులో ఉంటుంది. ఇంటర్నల్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇక నుంచి 30 శాతం పాఠాలు ఆన్లైన్ పద్ధతిలో, 70 శాతం పాఠాలు క్లాసురూంలో బోధించాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలతో పాటు అఫిలియేటెడ్, అటానమస్ కాలేజీల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అకడమిక్ సెనెట్లో అమోదం పొందిన వెంటనే సిలబస్ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు