న్యూఢిల్లీ: క్షయ చికిత్స చేయగలిగిన వ్యాధి. అయితే ఔషధ నిరోధకత టీబీ ఇప్పుడు ప్రధానమైన ఆందోళనకర సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బహుళ ఔషధ నిరోధకత-టీబీ(ఎండీఆర్-టీబీ) బ్యాక్టీరియా కేసులు 3.9 లక్షల కేసులు ఉండగా.. భారత్లో ఈ సంఖ్య గణనీయంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. ఈ తరహా క్షయవ్యాధి కేసుల వ్యాప్తిని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్షయవ్యాధిలో ఔషధ నిరోధకత బ్యాక్టీరియాను ముందస్తుగా రోగ నిర్ధారణ కోసం ఉపయోగపడే డీఎన్ఏ జన్యువుల్లో మ్యుటేషన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్కుమార్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ మేరకు అధ్యయనం నిర్వహించారు.