ఉమ్మడిగా చిన్న సన్నకారు రైతులు వినియోగించవచ్చు
కూలీల కొరతనే కాకుండా త్వరగా సస్యరక్షణ చర్యలు: వీసీ ప్రవీణ్ రావు
వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, విద్యుత్ వనరులు అందించడంతో, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు సంభవించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. వి.ప్రవీణ్ రావు అన్నారు. రాజేంద్రనగర్లోని పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో సోమవారం ‘ట్రాన్స్ఫా ర్మ్ ఇన్ ఇండియా టు అగ్రికల్చర్-టెక్నాలజీ అడాప్షన్ ఫార్మర్స్’ అంశంపై జరిగిన సదస్సులో ప్రవీణ్రావు పా ల్గొని మాట్లాడారు. వర్సిటీ, ధనూక అగ్రిటెక్ లిమిటెడ్లు సంయుక్తంగా నిర్వహించాయి. స్వాతంత్య్రం వ చ్చిన అనంతరం, హరిత విప్లవం వల్ల వ్యవసాయ రం గంలో మన దేశం అపార అభివృద్ధి సాధించిందని అ న్నారు. ఈ సందర్భంగా రైతులు రసాయన, సేంద్రీయ ఎరువులను సమపాళ్లలో వినియోగించాలని సూచించారు. 55-60 శాతం దేశ, రాష్ట్ర జనాభా వ్యయం పైనే ఆధారపడి ఉందన్నారు. మారుతున్న సాంకేతికతను వినియోగించుకుని పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ మారుతున్న ఆహార మార్పులకు అనుగుణంగా పంటల వైవిద్యం వైపు రైతాంగం మొగ్గు చూపాలన్నారు.
పరిమిత వనరులు, భూసార పరిరక్షణకు నీటి సామర్థ్యత యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కరువైన పంటలను సాగు చేయాలన్నారు. సాంకేతికత, శాస్త్రీయతల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని వ్యవసాయ రంగంలోని సవాళ్లను ఎదుర్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విత్తనాలు వినియోగించి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించాలని ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ, అగర్వాల్ సూచించారు. నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తిని అధికం చేయాలన్నారు. సూక్ష్మ సేద్యం అవలంబించాలని రైతులకు సూచించారు. చిన్న సన్నకారు రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన కోళ్లు, పశువులు, గొర్రెల పెంపకం వంటి వాటి ద్వారా కొంత అధిక ఆదాయం పొందవచ్చన్నారు. పరిశోధనా, బోధనా, రంగలలో దశాబ్దం తరబడి సేవలందిస్తున్న ప్రవీణ్ రావును ఘనంగా సత్కరించారు. ఆదర్శ సాగు పద్ధతులను అమలు చేస్తూ రైతులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. డ్రోన్ ప్రదర్శనలు రైతులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్, ఐసీఏఆర్ క్రీడా ప్రాజెక్టు డైరెక్టర్ డా. రవీంద్రచారి, ఐసీఏఆర్ మేజ్ మాజీ డైరెక్టర్ డా.సైందాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు, రైతులు పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.