దుబాయి : నైరుతి సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. విమానం దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. గత 24 గంటల్లో విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరుగడం ఇది రెండో సారి. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న షియా తిరుగుబాటుదారులతో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి ఈ దాడిపై స్పందించలేదు. సైనిక కూటమి మాత్రం తమ దళాలు డ్రోన్ను ‘అడ్డగించాయి’ అని పేర్కొన్నాయి. 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమితో పోరాడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీలోని సైనిక స్థావరాలు, కీలకమైన చమురు మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.