ఢిల్లీ,జూన్ 25: టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయని జరిగే పుకార్లపైనేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ)కు చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా స్పందించారు. దీనిపై మరింత లోతైన వివరణ ఇచ్చారు. పోలియో వ్యాక్సిన్ వచ్చి భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఇచ్చినప్పుడు కూడా ఈ రకమైన పుకారు వ్యాపించిందని ఆయన పేర్కొన్నారు.
పోలియో వ్యాక్సిన్ వేయించుకున్న పిల్లలు భవిష్యత్తులో వంధ్యత్వానికి గురవుతారని ఆ సమయంలో తప్పుడు ప్రచారం జరిగింది. అన్నిటీకాలు శాస్త్రీయ పరిశోధనల చేసిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని మనం తెలుసుకోవాలి. టీకాలు ఏవీ కూడా ఈ విధమైన దుష్ప్రభావాన్ని చూపవని డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా చెప్పారు. ఇటువంటి ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. మనం, మన కుటుంబం,సమాజాన్ని కరోనా వైరస్ నుంచి రక్షించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి,అందరూ ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.