యాదాద్రి/మెహిదీపట్నం, జనవరి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపుమేరకు పలువురు విరాళం అందజేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన బండారి శ్రీనివాస్ అండ్ బ్రదర్స్ రూ.50 లక్షల విరాళం సమర్పించారు. యాదాద్రి బాలాలయంలో సంబంధించిన డీడీని ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఈ సందర్భంగా దాత బండారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఆలయాలు నిర్మించారని చదివాం.. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో చూస్తున్నామని చెప్పారు. మహాద్భుత నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.