యాదాద్రి, నవంబర్ 20: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు దంపతులు రూ.52,116 విరాళం ప్రకటించారు. చెక్కును శనివారం ఆలయ అధికారులకు అందజేశారు. యాదాద్రి నారసింహుడి ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు.
పదిరోజుల్లో రూ.3.87 కోట్ల విరాళాలు
యాదాద్రి, నవంబర్ 20: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించిన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి ఈ నెల 8 నుంచి 18 వరకు భక్తుల నుంచి రూ.3.87 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రెండో విడుత ఇచ్చిన విరాళాలను కలుపుకొని మొత్తం రూ.3,87,93,951 ఆదాయం స్వామి వారికి సమకూరినట్టు వారు పేర్కొన్నారు.