హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు. నిజాంపేటలో కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో తోడుగా చంద్రశేఖర్ దంపతులు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు.
పరీక్ష ముగిసిన తర్వాత భార్య, కొడుకు ఇంటికి పంపి.. ఆ తర్వాత హోటల్లో ఆత్మహత్యకు చేసుకున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మెదక్ కారు డిక్కీలో డెడ్ బాడీ కాల్చివేత కేసులో చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కటిక శ్రీనివాస్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.