హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అక్రమ లేఅవుట్లను తొందరపడి క్రమబద్ధీకరించొద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున అక్కడే పరిషరించుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2015లో వెలువడిన జీవో 152ను సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున ఇకడి పిటిషన్లపై తిరిగి విచారణ చేయలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నుంచి వివరణ తీసుకోవాలని, అప్పటి వరకు పిటిషన్లను పెండింగ్లో పెడుతున్నట్టు తెలిపింది. విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.