హైదరాబాద్ , మే 26: అన్ని పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచివే అయినా కొన్ని పదార్ధాలను కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు కలిపి తినడం వల్ల శరీర జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. రెండు పదార్ధాలను కలిపి తినేటప్పుడు ఒకటి త్వరగా జీర్ణం అయ్యేలా ఉంటె మరొకటి జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. అలా జరిగితే జీర్ణ సమస్యలు తలెత్తడంతో పాటు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు తలెత్తుకుతాయి. ఇలాంటి వాటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఆహారాలను కలిపి తినకూడాదో తెలుసుకుందాం..
పొట్లకాయ, కోడి గుడ్డు కలిపి తినకూడదని మన పూర్వికుల నుండి చెప్పేవారు. కానీ ఎందుకు తినకూడదో మనకు తెలియదని. ఈ రెండింటిని కలిపి ఎందుకు తినకూడదంటే.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కోడి గుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణం అవ్వడానికి కాస్త టైం పడుతుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంది త్వరగా జీర్ణం అవుతుంది. అందువల్ల ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
అవును ఇది నిజమే.. ఈ రెండు పదార్దాలను కలిపి అస్సలు తినకూడదు. అరటి పండు తిన్న వెంటనే పాలు తాగినా లేదా పలు తగిన వెంటనే అరటిపండు తిన్న కడుపులో మంట వస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగదు. ఈ రెండు పదార్ధాలు కలిపి తీసుకోకూడదు. మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దుంపల్లో పిండి పదార్ధాలు ఉంటాయి. ఈ రెండు కలిపి తినడం వల్ల గ్యాస్ ఫేమవుతుంది. అందుకే మీరు వీలైనంత వరకు వీటిని తినక పోవడమే మంచిది.
ఈ రెండు పదార్ధాలు ఒకేసారి తీసుకున్న లేదంటే ఒకదాని తర్వాత మరొకటి తీసుకున్న కడుపులో బ్యాక్తీరియా చేరుతుంది. కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కానీ ఉడికించిన గుడ్డు తీసుకోవచ్చని నిపుణుల సలహా.. కానీ ఎక్కువ శాతం కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవడమే ఉత్తమం. ఈ రెండు కలిపి తినడం వల్ల కొంతమందికి కిడ్నీలో రాళ్ళూ ఏర్పడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందుకే మాక్సిమం ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండడమే మంచిది.