అమరావతి : ఏపీలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంత ఉదయ బాబు మాజీ సుబ్రహ్మణ్యం హత్య కేసును తీవ్రంగా ఖండించారు. ఏదేని ప్రమాదం జరిగితే పోలీసులు కేసు నమోదుచేయాలని, మరణిస్తే మృతదేహానికి శవ పంచనామా నిర్వహించేంత వరకు అక్కడి నుంచి మృతదేహాన్ని అంగుళం కూడా కదల్చరాదని స్పష్టంగా చట్టాలు ఉన్నాయన్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు చట్టాలను ఉల్లంఘించి డ్రైవర్ మృతదేహాన్ని ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించారు. మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకెళ్లి శవాన్ని తీసుకుంటారా లేదా అని హెచ్చరించి కారుతో సహ వదిలి వెళ్లడం చట్టం ఉల్లంఘనకు పాల్పడిన విషయం పోలీసులకు తెలియదా అని నిలదీశారు. పోలీసులు చట్టాలను ఎందుకు గౌరవించడం లేదని అన్నారు. ఎమ్మెల్సీపై సుమోటా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలులో ఉందా అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుపై వేసిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.