కోస్గి, డిసెంబర్ 5 : మున్సిపల్ సిబ్బందికి నాలుగు నెలలైనా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో మున్సిపల్ కార్యాలయాన్ని తని ఖీ చేసేందుకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి వచ్చినప్పుడు సిబ్బంది ఆయనకు ఫిర్యాదు చేశారు. అప్పటికప్పుడు అదనపు కలెక్టర్ స్పందించి 15 రోజుల్లో సిబ్బందికి వేతనాలివ్వాలని కమిషనర్ మల్లికార్జునస్వామిని ఆదేశించారు. కా గా మున్సిపాలిటీలో 93 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారిలో 28 మంది రూ.12 వేల వేతనాలు తీసుకోగా, 65 మంది రూ.5వేల వేతనాలు పొందుతున్నారు. అయితే రూ.5 వేల వేతనాలు ఎలా ఇస్తున్నారని అదనపు కలెక్టర్ కమిషనర్ను నిలదీయడంతోపాటు అడ్డదిడ్డంగా ఇంత మంది సిబ్బందిని ఎలా నియమించారని మండిపడ్డారు. అదనపు కలెక్టర్ తనిఖీ చేసి నెల గడుస్తున్నప్పటికీ నేటికి సిబ్బందికి వేతనాలు అందడం లేదు. నాలుగు నెలలుగా వేతనాలివ్వకుంటే ఎలా అని సిబ్బంది వాపోతున్నారు.
ఎలా బతకాలి
నాలుగు నెలలుగా జీతాలివ్వకుంటే ఎట్లా బతకాలి. అదనపు కలెక్టర్ చెప్పిన కమిషనర్ సార్ జీతం ఇస్తాలేడు. ఐదు వేలు ఇవ్వడానికి లేదు. కానీ అందరికీ రూ.12 వేలు ఇవ్వాలని అదనపు కలెక్టర్ చెబితే, ఐదు వేలు మాత్రం జీతం కావాలని రాసియ్యిండని మా కమిషనర్ సార్ అంటుండు. అట్లయితే ఇస్త లేకుంటే జీతం ఇవ్వనని అంటుండు.
ఆలస్యమైంది
సిబ్బంది ఎక్కువగా ఉండడంతోనే సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వేతనాలు అందిస్తాం. సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూస్తాం.