న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెటిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు శుక్రవారం వీగిపోయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత లోక్సభ బలం 543 సీట్లకు లోబడే తదుపరి ఎన్నిక నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు జరగాలని ప్రతిపాదిస్తూ డీఎంకే ఎంపీ పీ విల్సన్ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచకుండా లేదా సరిహద్దులు మార్చకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించింది.