శ్రీనగర్, అక్టోబర్ 25: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక తొలిసారి ఆ గ్రామంలో వెలుగులు విరజిమ్మాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) ప్రాంతంలోని ఆ గ్రామంలో హిందూ, ముస్లింలు కలిసి వెలుగు దివ్వెలను వెలిగించారు. హిందూ ముస్లిం బాయీబాయీ అని నిరూపించారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లా తీత్వాల్ అనే గ్రామంలో పునర్నిర్మిస్తున్న అతి ప్రాచీన శారదాదేవీ ఆలయంలో నిర్మాణ కమిటీ సభ్యుడు అజాజ్ఖాన్ నేతృత్వంలో విభజన తర్వాత మొదటి దీపావళి వేడుకలు నిర్వహించారు.
వందలాది మంది పాల్గొన్నారు. ఆర్మీ జవాన్లతో కలిసి మట్టి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. స్వీట్లు పంచుకున్నారు. ఈ దీపావళి ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించినట్టు సేవ్ శారదా కమిటీ ప్రెసిడెంట్ రవీందర్ పండిత తెలిపారు.