చాదర్ఘాట్:పేదింటి మహిళలకు షాదీముబారక్ ఒక వరంలాంటిదని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఎమ్మెల్యే బుధవారం తన కార్యాలయంలో మలక్పేట నియోజకవర్గం చార్మినార్ మండల పరిధిలో నివాసముండే 30 మంది మహిళలకు రూ.30,03,480 విలువ చేసే షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వానికి తమ పార్టీ ఎప్పుడూ సహకరిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ తహసీల్ అధికారులు పాల్గొన్నారు.