డిండి: డిండి ప్రాజెక్ట్ స్ఫిల్వే ముందు భాగంలో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి నీటిలో జారి పడి ఇద్దరు ఇవకులు మృతి చెం దిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(23), మహ్మద్ సాగర్(21)లతో పాటు మరో నలుగురు మిత్రులు వంగరి విశాల్, బుచ్చినేని బాల్ రాం, పకాలి వంశీ, కటిక అనిల్కుమార్లు ఈనెల 15న మూడు బైక్లపై హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూర్ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఆదివారం డిండి ప్రాజెక్ట్ను సందర్శించి ప్రాజెక్ట్ స్ఫిల్వే భాగంలో సెల్ఫీ తీసుకుంటూ సాగర్ జారి పడ్డా డు. అతనికి ఈత రాకపోవడంతో సాగర్ను కాపా డేందుకు ప్రవీణ్కుమార్ నీటిలో దూకాడు. అయితే సాగర్ ప్రవీణ్ను గట్టి గా వాటేసుకోవడంతో ఇద్దరు నీట మునిగారు.
పరిసర ప్రాంత వాసులు గమనించి కొన ఊపిరితో ఉన్న వారిని బయటకు తీసుకువచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. స్థాని క దవాఖానకు తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతులను దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరిలించారు.