డబ్లిన్: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని భువనేశ్వర్ కుమార్ విసిరాడా ? ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అతను 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు స్పీడ్ గన్ చూపించింది. కానీ ఆ స్పీడ్ గన్ తప్పు చూపించినట్లు తెలుస్తోంది.
Bhuvneshwar Kumar was bowled at 200+ KPH during the 1st T20 against Ireland at Dublin. #IREvIND pic.twitter.com/ZnIJAHYf1z
— Cricket insect (@000insect) June 27, 2022
తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. పౌల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బిరైన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే భువనేశ్వర్ వేసిన తొలి బంతిని స్టిర్లింగ్ ఎదుర్కొన్నాడు. కానీ స్పీడ్ గన్ ఆ బంతిని వేగాన్ని 201 కీలోమీటర్ల వేగంతో చూపించడం వల్ల అందర్నీ స్టన్ అయ్యారు. టీవీ స్క్రీన్లపై ఆ బంతి స్పీడ్ కనబడడంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే స్పీడ్ గన్లో పొరపాటు జరిగినట్లు గ్రహించారు. కానీ నెటిజన్లు మాత్రం ఆ స్పీడ్గన్ ఎర్రర్పై కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
నిజానికి అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డ్ పాక్ బౌలర్ షోయెబ్ అక్తర్ పేరిట ఉంది. ఇంటర్నేషన్ క్రికెట్లో అతను 161.3 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్లో స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ ఒక్క ఓవర్ వేశాడు.