హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్ నుంచి సర్టిఫైడ్ కాపీలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది. గతంలో భూ యజమానులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి సర్టిఫైడ్ కాపీలు తీసుకొనేవారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం మీ సేవ కేంద్రం నుంచి తీసుకొనేలా ఆప్షన్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లను కూడా ఈ ఆప్షన్ ద్వారా తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.