దమ్మపేట, జూలై 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన వసుమర్తి రామభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వాసవీ క్లబ్ కార్యాలయంలో ఎన్నిక జరగగా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంతో రెండోసారి అధ్యక్షుడిగా రామభద్రం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని సంఘాన్నే కాకుండా అందరి సమస్యలను బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాలలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా తనను రెండోసారి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన పేరుపేరునా అందరికి ధన్యవాదాలు తెలిపారు.