హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ (ఎస్సార్పీసీ) చైర్మన్గా తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు రెండోసారి ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర విద్యుత్తు అథారిటీ ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్తుకు సంబంధించిన అంశాలను పరిశీలించి, పలు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ పవర్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇందులో దక్షిణ ప్రాంత పవర్ కమిటీకి ప్రభాకర్రావును చైర్మన్గా నియమించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 2015-16 లోనూ ప్రభాకర్రావు చైర్మన్గా వ్యవహరించారు. ఎస్సార్పీసీ దక్షిణాదిలోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి పరిధిలో విద్యుత్తుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు కనుగొని అమలుకు కృషి చేస్తుంది.