మరికల్, మార్చ్ 14 : మరికల్ మండల కేంద్రంలోని పల్లె గడ్డ గ్రామంలో సుమారు 100 మంది శ్రీవారి భక్తులు మన్నెంకొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నందుకై పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు మాట్లాడుతూ పల్లె గడ్డ గ్రామంలో ని ప్రతి ఇంటి నుండి ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఆయా దేవాలయాల దర్శనాలకు ప్రతినెల విడుదలవారీగా గ్రామస్తులు వెళుతుంటారు అన్నారు.
అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ప్రతి ఏటా గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు యువకులు భక్తులు తరలి వెళ్లడంతో పాటు అక్కడ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవారి సేవ సమితి ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివెలనున్నట్లు తెలిపారు