పాపన్నపేట, మార్చి 12 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తు లు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, బోనాలు, తలనీలాలు, సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సారశ్రీనివాస్ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవి వీర్కుమా ర్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోశ్ ఏర్పాటు చేశారు. వేదపండితులు, శంకరశర్మ, పార్థివశర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ తగిన బందోబస్తు చర్య లు చేపట్టారు.