శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు భక్తులు విరాళాలు సమర్పించారు. శనివారం హైదరాబాద్ హబ్సీగూడకు చెందిన మార్చర్ల మోగిలాగౌడ్ కుటుంబసభ్యులు కుటీర నిర్మాణ పథకానికి రూ.5లక్షలు, మెదక్కు చెందిన జీ శ్రీనివాస్ అన్నదాన పథకానికి రూ.లక్ష, కృష్ణాజిల్లాకు చెందిన రవికిరణ్ దంపతులు గో సంరక్షణా నిధికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు విరాళం చెక్కులను ఆలయ అధికారులు అందించారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ అధికారులు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, అందించి సత్కరించినట్లు ఈవ లవన్న తెలిపారు.