హైదరాబాద్: పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769కి పెంచారని చెప్పారు. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుతున్నదని చెప్పారు.
మూడో ఫైనాన్స్ కమిషన్ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు ఇచ్చే తలసరి గ్రాంటును 4:8:4 నుంచి 8:16:8 పెంచాలని సిఫారసు చేసిందని, 2017-18 వరకు 4:8:4 నిష్పత్తి విధానమే కొనసాగించని వెల్లడించారు. 2018-19 నుంచి విడుదలైన మొత్తం 2019-20 సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ 2021 వరకు పల్లె ప్రగతి కొరకు కేంద్ర ఫైనాన్స్ నిధులతో సమానమని తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ నుంచి మొత్తం రూ.7 వేల 435 కోట్ల 48 లక్షలు విడుదల చేశామన్నారు.